మెగా అభిమానులకు పండగలాంటి వార్త!

చిరంజీవి, రామ్ చరణ్.. ఇద్దరూ ఒకే తెరపై కనిపిస్తే.. మెగా అభిమానులకు పండగే పండగ. గతంలో మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో చిరు తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే. అతిథి పాత్రల్లో కనిపించి.. మెగా అభిమానులకు కనువిందు చేశారు. అయితే ఈసారి చిరంజీవి సినిమాలో చెర్రీ కనిపించనుండటం విశేషం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. సందేశాత్మక చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించనున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన చెర్రీ.. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిసింది. ఈ మేరకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ.. అది పూర్తవ్వగానే కొరటాల సినిమాలో నటించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. షూటింగ్ త్వరిత గతిన పూర్తి చేసేందుకు కొరటాల టీమ్ ప్రయత్నిస్తోంది. 99 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని.. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ వేడుకలో కొరటాల నుంచి చిరు మాట తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అందరిలోనూ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

More News

ప్ర‌బాస్ భామ ఫొటో షూట్‌కు ఒళ్లంతా కళ్లు చేసుకోవలసిందేనా.!

అందాల ఆరబోతలో ముందుండే స్కార్లెట్ మెలిష్ విల్సన్.. తాజాగా కళ్లు చెదిరే పిక్స్‌తో కుర్రకారు మతులు పోగొడుతోంది.

‘జాన్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న అమిత్ త్రివేది!

బాహుబలి స్టార్‌గా ప్రభాస్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్

‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు.

ఏపీలో మరోసారి చక్రం తిప్పనున్న కేసీఆర్!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అయిపోయాయ్.. కేసీఆర్ అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ పార్టీ గెలిచింది..

నిర్భయ దోషులకు డెత్ వారెంట్...

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్షకు విధింపుకు హైకోర్టు తీర్పు వెలువరించంది.