close
Choose your channels

నిర్భయ దోషులకు డెత్ వారెంట్...

Tuesday, January 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్షకు విధింపుకు హైకోర్టు తీర్పు వెలువరించంది. తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు చెప్పింది. కాగా.. ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఎనిమిదేళ్లపాటు ఇలాగే కాలం గడిసిపోయింది. అయితే ఇలా జాప్యం జరుగుతూ వస్తుండటంతో దోషులకు తక్షణమే శిక్ష అమలు చేసి తీరాల్సిందేనని నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. మంగళవారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు దోషులకు డెత్ వారెంట్ జారీచేసింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలో తమకు న్యాయపరంగా అవకాశాలున్నాయని దోషుల తరపు న్యాయవాదులు పేర్కొనగా.. దోషులకు డెత్ వారెంట్ వెంటనే జారీచేయాలని నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది కోరారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అవకాశమున్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చని కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

మా బిడ్డకు న్యాయం జరిగింది!

కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆనందం వ్యక్తం చేశారు. ‘మా బిడ్డకు న్యాయం జరిగింది. ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది’ అని ఆశాదేవి చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.