ఇంకెక్క‌డైనా రాసుకోమంటున్నాడు!

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

అభిమానం ఉండ‌వ‌చ్చు. ఆ అభిమానాన్ని మ‌నం ఎలాగైనా చూపించుకోవ‌చ్చు. కొన్నిసార్లు అభిమానం మ‌రింత పెరిగితే... తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో అదే జ‌రిగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌ను 'రౌడీస్' అని పిలుచుకుంటార‌నే విష‌యం తెలిసిందే.

అయితే అభిమానుల్లో ఒక‌రు త‌న నెంబ‌ర్ ప్లేట్‌కి బ‌దులు 'రౌడీ' అని రాయించుకున్నాడు. దాన్ని గ‌మనించిన ట్రాఫిక్ పోలీస్ 'రౌడీ' అనే నెంబ‌ర్ ప్లేట్‌ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. అది ఏకంగా వైర‌ల్ అయింది. వెంట‌నే విజ‌య్‌దేవ‌ర‌కొండ దాన్ని చూసి స్పందించారు.

కొన్ని రూల్స్ ని ఫాలో చేయాలి అని త‌న అభిమానుల‌కు హిత‌బోధ చేశారు. అంత‌కు ముందే ట్రాఫిక్ పోలీస్‌కు సారీ చెప్పారు. అభిమానులను ఉద్దేశించి అభిమానం ఉంటే దాన్ని ఇంకో ర‌కంగా చూపించండి. అంతేగానీ నెంబ‌ర్ ప్లేట్ల ద‌గ్గ‌ర రౌడీ అని రాయొద్దు. న‌చ్చిన వారి పేరును నెంబ‌ర్ ప్లేట్‌మీద కాకుండా వేరే ఎక్క‌డైనా రాసుకోండి అని చెప్పారు.

More News

జనసేనలో ఆ ఇద్దరికీ కీలక బాధ్యతలు

జనసేనలో ఇప్పటికే పలువురికి కమిటీల పేరిట పదవులిచ్చిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా మరో ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించారు.

అద్వానీకి మరోసారి మోడీ మొండిచేయి!

బీజేపీ కురువృద్ధుడు, కమలదళంలో పేరుగాంచిన కీలక నేత అయిన ఎల్‌కే అద్వానీకి.. ప్రధాని మోదీ మరోసారి మొండిచేయి చూపారు!.

నేడు గాజువాకలో పవన్ నామినేషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి భీమవరం రెండు శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

పోసానికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్

టాలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది.

టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఊహించని కీలకనేత

నంద్యాల ఎంపీ, టీడీపీ కీలకనేత ఎస్‌పి‌వై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌తో