బిగ్‌బాస్‌4 వ్యాఖ్యాత‌గా సమంత‌..?

  • IndiaGlitz, [Friday,June 26 2020]

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఎప్ప‌టి నుండో నాలుగో సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా..సోష‌ల్ మీడియాలో ఇప్పుడు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభం గురించి రోజుకొక వార్త వినపడుతుంది. నిజానికి క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే జూన్‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

నిన్నా మొన్నటి వరకు మూడో సీజన్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జ‌నే నాలుగో సీజ‌న్‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా మ‌రో పేరు విన‌ప‌డుతోంది. అయితే ఆపేరు అక్కినేని క్యాంప్‌కు సంబంధించిన వ్య‌క్తి పేరే కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కూ ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. స‌మంత అక్కినేని. ఓ బేబీ త‌ర్వాత స‌మంత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. మ‌రో సినిమాలో ఆమె న‌టించ‌డానికి స‌మయం ప‌ట్టేలా ఉంది. దీంతో స్టార్ మా నిర్వాహ‌కులు స‌మంత‌ను అప్రోచ్ అయ్యార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై ఏమైనా క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

More News

డిజిట‌ల్ రంగంపై క‌న్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో యువీ క్రియేష‌న్స్ ఒక‌టి. వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు ఈ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను రూపొందించే సంగ‌తి తెలిసిందే.

ఓ స్టార్ హీరోతో ‘షాడో’ను రూపొందించనున్నాం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్

మధుబాబు రచించిన తెలుగు నవల ‘షాడో’ ఇప్పుడు దృశ్యరూపంగావించబడుతోంది. అతి పెద్ద నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్స్

రాజేష్‌ టచ్‌రివర్‌ దర్శకత్వంలో 'సైనైడ్‌'

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్‌ టచ్‌రివర్‌ ప్రకటించిన కొత్త సినిమా 'సైనైడ్'.

రచ్చకెక్కిన దాస‌రి త‌న‌యుల ఆస్థి గొడ‌వ‌

సీనియ‌ర్ దివంగ‌త ద‌ర్శ‌కుడు డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుల మ‌ధ్య ఆస్థి గొడ‌వ‌లు రేగాయి. దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు, చిన్న కొడుకు అరుణ్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌

హుద్రోగులు, హై బీపీ ఉన్న వారికి షాకింగ్ న్యూస్..

కరోనా నుంచి కోలుకున్న బాధితుడికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అంటే.. అలా అని ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలూ లేవని వైద్యులు చెబుతున్నారు.