close
Choose your channels

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్!

Wednesday, July 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన నిన్న ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో కరోనా కారణంగా తాను క్వారంటైన్‌లో ఉండాలనుకుంటున్నానని.. పది రోజుల పాటు ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని వెల్లడించారు. ‘‘కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేను ఒక వారం లేదా పది రోజులపాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని భావిస్తున్నా. ఎమర్జెన్సీ అయితే తప్ప నేను ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండను’’ అని ట్వీట్ చేశారు.

అయితే విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని రూమ్‌ నెంబర్‌ 223లో ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలతో సమావేశాలు నిర్వహించిన సమయంలో కోవిడ్ నిబంధనలను పట్టించుకోలేదని.. కొన్ని సార్లు మాస్కు కూడా ధరించలేదని ఆరోపణలు వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.