'శ్రీపూర్ణిమ' మా అదృష్టమన్న జబర్దస్త్ టీమ్

  • IndiaGlitz, [Thursday,October 10 2019]

గురువారం వస్తే చాలు నవ్వుల ప్రియులకు పండగే. ' జబర్దస్త్ ' ప్రోగ్రామ్ తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోంది. రేటింగ్ కూడా చాలా హై లెవెల్లో ఉంటోంది. రోజా నవ్వుల వెన్నెల, నాగబాబు గాంభీర్యంతో కూడిన నవ్వుల జడ్జిమెంట్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్. అయితే దసరా పండుగ సందర్భంలో జరిగిన జబర్దస్త్ షూటింగ్ లో ఒక ఆసక్తికర పవిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యుల్లా జబర్దస్త్ టీం మెంబెర్స్ ని ఎంతో ఆప్యాయంగా చూసే రోజా టీం మెంబెర్స్ అందరికీ ఒక అపురూపమైన పుస్తకాన్ని దసరా గిఫ్ట్ గా ఇచ్చింది.

రోజా సమర్పించిన ఈ కానుక పేరే 'శ్రీ పూర్ణిమ'. సుమారు ఎనిమిదివందల అద్భుతమైన అందాల పవిత్ర పూజనీయ గ్రంధం ఈ శ్రీపూర్ణిమ .

ఈ గ్రంథరచయిత , సంకలనకర్త ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గారు. సహజంగా భక్తురాలైన శ్రీమతి రోజా పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలకు ప్రచురణకర్తగా వ్యవహరించడానికి కారణం వుంది. ఇంతకు ముందు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవిలో రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులై , మహాక్షేత్రమైన శ్రీశైలదేవస్థానానికి కూడా ప్రత్యేక సలహాదారునిగా వ్యవహరించిన ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్.

తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే ఆడంబరాలకు, ఆర్భాటాలకు, ప్రచారాలకు, సభలకు, సమావేశాలకు శ్రీనివాస్ చాలా దూరంగా వుంటారు . కీర్తికి కూడా చాలా చాలా దూరంగా వుంటారు. అన్నిటికీ మించి అస్సలు స్వార్ధం లేని వ్యక్తి శ్రీనివాస్. జీవితం ఎన్నో కష్టాలు పడినా దైవాన్ని విడిచిపెట్టకుండా అద్భుతాలు చేస్తూనే వున్నారు. అందుకే రోజా శ్రీనివాస్ ని పుస్తకాలకు తాను సమర్పకురాలిగా వ్యవహరించారు. శ్రీనివాస్ కష్టాలకు కొలతలు లేవు. అన్ని బాధలు అనుభవించారాయన. అయినా వెంకటాచలక్షేత్రం అతనికి ఏడుకొండలతో అభయాన్నిస్తూనే వుంది. ఆ నమ్మకంతో శ్రీనివాస్ చేసిన దైవీయ చైతన్యాల ప్రయోగాలు అమోఘం.

పీఠాలలో, మఠాలలో, ఆలయాలలో, పండిత గృహాలలో , గ్రంథాలయాలలో, భక్తజన గృహాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలకు కొదువలేదు. ప్రతీ పుస్తకం ఒక మంత్రం పుష్పమే. ప్రతీ పుస్తకం ఒక మంత్రం పేటికే. ప్రతీ పుస్తకం ఒక మంత్రాలయమే. ప్రతీ పుస్తకం ఒక మంత్రం సమూహ శక్తే. రోజా సమర్పించిన ఈ గ్రంధంలో సైతం తనకు ఆత్మ బంధువులైన వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల పేర్లను శ్రీనివాస్ కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటించడం గమనార్హం.

రోజా ఇటీవల పురాణపండ శ్రీనివాస్ తో ప్రచురించిన శ్రీపూర్ణిమ గ్రంధానికి వచ్చిన స్పందన మామూలు స్థాయిలో లేదు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, యాదాద్రి మొదలుకొని ఎన్నో , ఎన్నెనో మహా శైవ వైష్ణవ ఆలయాల అర్చకులకు, వేద పండితులకు, వేదపాఠశాలలకు రోజా స్వయంగా సమర్పించడంతో రోజా ని ' శహభాష్ ' ప్రశంసించి దీవించారు. అయితే ... దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ఈ అమృతమయ శ్రీ పూర్ణిమ గ్రంధాన్ని అందించడంతో హైపర్ ఆది, చలాకి చంటి మొదలు, దొరబాబు వరకు పరవశంతో రోజాకు 'థాంక్స్ మేడం ' సూపర్ బుక్ ఇచ్చారంటూ ధన్యవాదాలు చెప్పారు.

రోజా చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి అనుగ్రహంతో ఈ బుక్ ఇస్తున్నానని, ఖాళీ సమయాల్లో ప్రార్ధనకై ఇది చాలా ఉపయోగపడుతుందని జబర్దస్త్ మొత్తం టీం కి చెప్పడం విశేషమే మరి. ఏది ఏమైనా రోజా శ్రీపూర్ణిమ మహాగ్రంధం పురాణపండ శ్రీనివాస్ చేసిన పవిత్రమైన సందడి మామూలు స్థాయిలో లేదు. ఒక రాజకీయ నాయకురాలు తెలుగు రాష్ట్రాలలో పారమార్థికంగా ఇలాంటి అద్భుత మంత్రసేవ చేయడం ఇదే మొదటిసారి కావచ్చని విజ్ఞులు గొంతెత్తి రోజా పేరు చెప్పడం చరిత్రలో మిగిలే సత్యం.

More News

ఐదు అద్భుతాలతో హల్ చల్ చేస్తున్న పురాణపండ శ్రీనివాస్

అసాధారణ ప్రతిభావంతుడైన పురాణపండ శ్రీనివాస్ అనే ఒకే ఒక్క రచయిత ప్రసార ప్రచార మాధ్యమాలకు దూరంగా తానే శ్రామికుడై, తానే యజమానై అద్భుత గ్రంధాలను రచించి, సంకలనం చేసి

వ‌ర‌ద బాధితులకు అమితాబ్ సాయం

కొన్ని రోజులుగా బిహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జలు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. 15 జిల్లాల్లోని 1400 గ్రామాలు జ‌ల‌మ‌య‌మైయాయి.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌. ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాలతో సూప‌ర్‌డూప‌ర్

రాహుల్‌తో ఉన్న రిలేష‌న్ గురించి నోరు విప్పిన పున‌ర్న‌వి

బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఆస‌క్తిరేపిన అంశాల్లో రాహుల్ సిప్లిగంజ్‌, పున‌ర్న‌వి భూపాలం మ‌ధ్య ఏదో ఉంద‌నే అంశం కూడా ఒక‌టి. ఇద్ద‌రూ చాలా క్లోజ్‌గా మెలిగారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేశ్‌ మూవీ

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి రెండు వ‌రుస విజ‌యాల త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నుంచి రానున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న