close
Choose your channels

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేశ్‌ మూవీ

Wednesday, October 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేశ్‌ మూవీ

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` వంటి రెండు వ‌రుస విజ‌యాల త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నుంచి రానున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక విజ‌యశాంతి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. మ‌హేశ్ బాబుకి జోడీగా `ఛ‌లో` బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న నాయిక‌గా న‌టిస్తుండ‌గా... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో మెర‌వ‌నుంది.

ఇదిలా ఉంటే, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 75 శాతం షూటింగ్ పూర్త‌య్యింద‌ని తెలిసింది. ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్ సెట్‌లో మ‌హేశ్‌, కొంత‌మంది ఫైట‌ర్స్‌పై చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు యాక్ష‌న్ ప్రియుల‌ను మురిపిస్తాయ‌ని స‌మాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ‌హేష్ పోస్ట‌ర్‌ణు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మ‌హేశ్ గొడ్డ‌లి ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నాడు. ఈ పోస్ట‌ర్ మ‌హేశ్ క్యారెక్ట‌ర్‌లోని ఇన్‌టెన్సిటీని తెలియ‌జేస్తుంది. అలాగే సినిమా లేటెస్ట్‌గా క్లైమాక్స్‌ను రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌రిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.