'సరిలేరు..' లో జగపతి లేరు!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు ఇప్పుడు సీరియస్ నోట్లో ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. `సరిలేరు నీకెవ్వరు`లో ఆయన స్థానంలో ప్రకాష్రాజ్ను తీసుకున్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్బాబు, అనిల్ సుంకర, దిల్రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతోంది. ఇందులో విలన్గా ముందు జగపతిబాబును అనుకున్నారు.
ఈ సినిమా కోసం జగపతిబాబు కాల్షీట్ కూడా పెద్దగానే కేటాయించారు. సందీప్ కిషన్ చిత్రంతో పాటు మరో తమిళ సినిమాను కూడా ఆయన వదులుకున్నారు. తీరా త్వరలో షూటింగ్కి వెళ్లాల్సి ఉందనగా, ఆయన సీన్లో లేరనే విషయం తెలిసిందట. ఇదే విషయాన్ని మహేష్గానీ, దిల్రాజుగానీ చెబితే వేరుగా ఉండేదట. కానీ ఆయనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదని తెలిసింది. దీంతో ఆయన అప్సెట్ అయ్యారట. ఈ చిత్రంతోనే విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపిస్తారు. రష్మిక మండన్న హీరోయిన్గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.