close
Choose your channels

జేసీ.. మోదీ భజన..బాబుపై షాకింగ్ కామెంట్స్.. హలో అంతే!

Saturday, September 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జేసీ.. మోదీ భజన..బాబుపై షాకింగ్ కామెంట్స్.. హలో అంతే!

టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీ భజన మొదలుపెట్టారు. అంతేకాదు.. మోదీని ఆకాశానికెత్తేసి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది. ఆ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చు. ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర ఉంది. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ ఆధారపడి ఉంది. మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా నడుస్తోందని.. ఆ హవాతోనే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. కొందరు టీడీపీ నేతలు కూడా అలాగే బీజేపీలో చేరారు. చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు, మోదీ ప్రవేశపెట్టిన పథకాలు కారణం’ అని జేసీ అభిప్రాయపడ్డారు.

జమిలీ ఎన్నికలపై..
‘జమిలీ ఎన్నికలపై కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు తట్టుకొని నిలబడటం, మనుగడ కొనసాగించడం కష్టమే. బీజేపీపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నేను ఆ పార్టీలో చేరబోతున్నట్లు కాదు. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి నన్ను కలిసి మాట్లాడారు. హాయ్ చెప్పారు అంతే.. అలాగని నేను పార్టీ మారుతున్నట్లు కాదు’ అని జేసీ చెప్పుకొచ్చారు.

కాగా.. ఇటీవలే జగన్ 100 రోజుల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివాక‌ర్‌రెడ్డి.. ఇప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేయడం, చంద్రబాబు తప్పులు చేశారనడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి చూస్తే జేసీ పార్టీ మారడం దాదాపు ఖాయమని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.