close
Choose your channels

K Viswanath: అందుకే ఆయన కళాతపస్వి : చివరి శ్వాస వరకు కళామతల్లి సేవలోనే.. పాట రాస్తూ మృత్యు ఒడిలోకి

Friday, February 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త నడకను నేర్పి, ఎన్నో అపురూప చిత్రాలను అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన నిష్క్రమణతో టాలీవుడ్‌లో ఒక శకం ముగిసినట్లయ్యింది. సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగారు. అయితే ఆయన మరణించే చివరి క్షణాల వరకు కళామతల్లి సేవలోనే గడిపారు. తన చివరి క్షణాలకు ముందు పాట రాస్తూ .. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికి అందించి,తన వల్ల కాదని పాటను పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. కానీ ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే విశ్వనాథ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇది విశ్వనాథ్ ప్రస్థానం:

1930 ఫిబ్రవరి 19న అప్పటి గుంటూరు జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ . గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్, ఏసీ కాలేజీలో బీఎస్సీ అభ్యసించారు. ఆయన తండ్రి మద్రాస్‌లోని విజయవాహినీ స్టూడియోలో పనిచేశారు. దీంతో విశ్వనాథ్ సైతం విజయవాహినీలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ బైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. అలా సినీ రంగంలోని అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా మారారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, ఆపద్భాంధవుడు, శంకరాభరణం వంటి ఆణిముత్యాలను టాలీవుడ్‌కు అందించి తెలుగు చిత్రసీమకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు.

తన సినీ ప్రస్థానంలో 50కి పైగా సినిమాలకు దర్శకత్వంలో వహించారు విశ్వనాథ్. ఇందులో 9 హిందీ సినిమాలు కూడా వున్నాయి. మూసలో వెళ్తున్న తెలుగు చిత్ర సీమకు ఆయన కొత్త దిశను చూపారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి నటుడిగా అవతారమెత్తారు విశ్వనాథ్. అలా తెలుగు, తమిళ భాషల్లో 30 వరకు సినిమాల్లో నటించారు.

సినీ రంగానికి విశ్వనాథ్ చేసిన కృషికి గాను.. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డ్, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాలు ఆయనను వరించాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. ఇక విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. అలాగే స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల వంటి చిత్రాలు ఆసియా పసిఫిక్ చలనచిత్రాలు ప్రదర్శితమయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.