Lokesh :ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల 'శంఖారావం'కి లోకేష్ సిద్ధం

  • IndiaGlitz, [Thursday,February 08 2024]

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈనెల 11 నుంచి 'శంఖారావం' పేరిట ప్రచారానికి రెడీ అయ్యారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు. శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటన సాగనుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11వ తేదీ ఉదయం 9 గంటలకు తొలి సభ జరుగనుందని పేర్కొన్నారు. ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపటమే శంఖారావం లక్ష్యమన్నారు. సీఎం జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా లోకేశ్ పర్యటన సాగనుందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 'రా.. కదలిరా' పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా జనాల్లోకి రానున్నారు. అలాగే చంద్రబాబుతో కలిసి భారీ బహిరంగసభల్లోనూ పాల్గొననున్నారు. మొత్తానికి సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు రావడంతో టీడీపీ-జనసేన కూటమి ప్రచారంలో స్పీడ్ పెంచింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో గతేడాది జనవరి 27న యువగళం పాదయాత్రను లోకేష్‌ ప్రారంభించారు. మొత్తం 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా 226రోజులు పాటు 3,132 కిలో మీటర్ల మేర సాగిన పాదయాత్రను డిసెంబర్ 18న ముగించారు. మధ్యలో నందమూరి తారకరత్న ఆకస్మిక మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, చంద్రబాబు అరెస్ట్ సమయంలో పాదయాత్రకు విరామం ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

More News

Yatra 2:తెలుగు రాష్ట్రాల్లో 'యాత్ర-2' ప్రభంజనం.. దద్దరిల్లుతోన్న థియేటర్లు..

ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన 'యాత్ర-2' మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు

2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Chandrababu:అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీఏలోకి ఆహ్వానం..

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరూ పొత్తులో కలుస్తారో అర్థం కాని పరిస్థితి.

Sharmila :తన చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ టార్గెట్‌గా షర్మిల విమర్శలు..

తన భద్రతపై సీఎం జగన్‌ టార్గె్‌ట్‌గా మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.