మలయాళం డీజే ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Tuesday,July 04 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉంది. మాలీవుడ్‌లో బ‌న్ని అంద‌రూ మ‌ల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. తెలుగులో విడుద‌లైన అల్లు అర్జున్ ప్ర‌తి సినిమా మ‌ల‌యాళంలో విడుద‌ల‌వుతుంటుంది. రీసెంట్‌గా తెలుగులో విడుద‌లైన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ వంద‌కోట్ల మైలురాయిని అందుకుంది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ సినిమాను కూడా మ‌ల‌యాళంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
మల‌యాళ వెర్ష‌న్‌లో సినిమాను జూలై 14న విడుద‌ల చేయాల‌నేది వారి ఆలోచ‌న‌ట‌. ప్ర‌స్తుతం బ‌న్ని యు.ఎస్‌లో డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు. అల్లుఅర్జ‌న్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ హిట్ మూవీ 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో రూపొందిన 25వ చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్ని వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో న‌టిస్తాడు.

More News

ముస్తాబవుతున్న ఓయ్..నిన్నే.

సోలో నువ్వా-నేనా,రా రా కృష్ణయ్య చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్

రవితేజ స్థానంలో కుర్ర హీరో....

స్వామి రా రా సినిమా నుండి సక్సెస్ ట్రాక్ ఎక్కిన యువ కథానాయకుడు నిఖిల్

బన్నిని కెలికాడు...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్ని ఇప్పడు 'నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా సినిమా కోసం సమాయత్తమవుతున్నాడు.

మహేష్ తమిళ డబ్బింగ్....

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగ దాస్ దర్శకత్వంలో

'శమంతక మణి' పెద్ద హిట్ కావాలి - పూరి జగన్నాథ్

నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'శమంతకమణి'.