close
Choose your channels

'మిస్ ఇండియా' కు ముహూర్తం కుదిరింది

Wednesday, February 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిస్ ఇండియా కు ముహూర్తం కుదిరింది

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత మహేశ్ కోనేరు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ సినిమా కోసం కీర్తి సురేశ్ పూర్తిగా త‌న లుక్‌ను మార్చుకుంది. అప్ప‌టి వ‌ర‌కు బొద్దుగా క‌న‌ప‌డ్డ ఈ అమ్మ‌డు బ‌రువు పూర్తిగా తగ్గిపోయింది.

జ‌గ‌ప‌తిబాబు, న‌వీన్‌చంద్ర‌, వి.కె.న‌రేశ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్‌.ఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మాయిలు ఎదుర్కొంటున్న స‌మకాళీన స‌మ‌స్య‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న కీర్తిసురేశ్ మిస్ ఇండియా సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకుంది. మ‌రి ఈ సినిమా కీర్తికి ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.