close
Choose your channels

శ్రీవిద్యానికేతన్‌కు యూనివర్సిటీ హోదా: ‘‘ చిన్న మొలకలు... కల్ప వృక్షంగా’’ మారాయంటూ మోహన్ బాబు ట్వీట్

Thursday, January 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. వెండితెరపై రాణిస్తున్న సమయంలోనే పేదా, ధనిక, కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తున్నారు మోహన్ బాబు. ‘‘శ్రీవిద్యానికేతన్’’ పేరిట విద్యాసంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా 25 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న లక్షలాది మంది విద్యార్ధులు దేశ , విదేశాల్లో కీలక స్థానాల్లో వున్నారు. వీరిలో సినీనటుడు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు ఇలా ఎన్నో రంగాలకు చెందిన వారున్నారు.

ఈ క్రమంలో శ్రీవిద్యానికేతన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మోహన్ బాబు నిర్వహిస్తున్న శ్రీ విద్యానికేతన్ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా పెదరాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు

” చిన్న మొలకలుగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం .. విద్యాసంస్థలను ఇప్పుడు యూనివర్సిటీ స్ధాయికి చేర్చాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని ఇప్పటినుంచి మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం.. మీ సహకారం ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

1993లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థను ప్రారంభించారు మోహన్ బాబు. ఆ తర్వాత విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ నెలకొల్పారు. అన్ని విద్యా సంస్థలు ఒకేచోట ఉండటంతో చాలా రోజులుగా యూనివర్సిటీ హోదా కోసం ప్రయత్నిస్తున్నారు మోహన్ బాబు. ఈ యత్నాలు ఫలించి ఆయన కోరిక నెరవేరింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.