ముగ్గురు పసివాళ్లకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యాయత్నం

  • IndiaGlitz, [Friday,March 19 2021]

అభం శుభం.. పాపం పుణ్యం తెలియని చిన్నారులు.. అమ్మ ఏదిచ్చినా అమృతంలా భావించి తాగేస్తారు.. ఈ క్రమంలోనే అమ్మ విషం ఇచ్చినా కళ్లు మూసుకుని తాగేశారు.. అంతే ఆ కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. ముగ్గురు పసివాళ్లకూ విషమిచ్చిన అనంతరం తాను విషం తాగింది. అయితే ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లె గ్రామంలో జరిగింది. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.

అసలు విషయంలోకి వెళితే.. మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన సుబ్బనరసమ్మ, నిత్యపూజయ్య దంపతులకు సుబ్బరాయుడు (3), సుబ్బరత్న (2), బాబు (రెండు నెలలు) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిత్యపూజయ్య పొలం పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వచ్చిన కూలి డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తుండటంతో కనీసం కుటుంబం గడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద మనుషులు సర్దుబాటు చేసేవారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆ మనస్పర్థలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్యతో గొడవపడి భర్త పొలం పనికి వెళ్లిపోయాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సుబ్బనరసమ్మ ఏం ఆలోచించిందో ఏమో కానీ తన ముగ్గురు పిల్లలకూ పురుగుల మందు తాగించి తనూ తాగేసింది. నలుగురూ ఎంతకీ ఇంటిలో నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో పిల్లల నానమ్మ అయ్యవారమ్మ ఇంటి తలుపు తీసి చూసింది. నలుగురు నేలపై పడిపోయి ఉండటాన్ని గమనించి భయంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి... ఆ నలుగురినీ రిమ్స్‌కు తరలించారు. కొద్దిసేపటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందగా... సుబ్బనరసమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కడప డీఎస్పీ బూడిద సునీల్, రిమ్స్‌ సీఐ పి.సత్యబాబు, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఆర్వీ కొండారెడ్డి విచారణ నిర్వహిస్తున్నారు.

More News

మహేష్ కారవాన్ ధర తెలిస్తే...

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయింది. అది ఆయన కారవాన్ గురించి.

ఆచార్య’కు సంబంధించి చిరు మరో లీక్ చేసేశారు..

సినిమాలకు సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడమనేది చాలా ముఖ్యం. అభిమానులకు ఇలాంటి సస్పెన్స్‌లే కిక్ ఇస్తుంటాయి.

వరల్డ్ స్లీప్ డే.. నిద్ర ఒక యోగం.. లేకపోవడం రోగం

జీవితానికి అత్యంత అవసరమైన వాటిలో నిద్ర ఒకటి. పడుకున్న వెంటనే నిద్ర పట్టడం ఒక యోగం.. నిద్రించడం భోగం.. నిద్ర లేకపోవడం రోగం. నిజమే నిద్ర లేకుంటే వచ్చే శారీరక రుగ్మతలెన్నో.

ఇంట్రస్టింగ్.. బాలయ్యకు కూతురిగా సాయిపల్లవి!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇలా కొందరు సీనియర్ హీరోలు వయసు 60 దాటుతున్నా.. పక్కన యంగ్ హీరోయిన్స్‌తో హీరోగా నటించేందుకే ఇప్పటి వరకూ ఆసక్తి చూపారు.

రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్లకు ముంచేసిన జయచిత్ర కుమారుడు

సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, యువ సంగీత దర్శకుడు అమ్రేష్ ఒక వ్యక్తిని రూ.26 కోట్లకు ముంచేశాడు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో ఉన్న రైస్ పుల్లింగ్ ఎపిసోడ్‌ని ఆధారంగా చేసుకున్నాడో..