మెగాఫోన్ ప‌ట్ట‌నున్న నిఖిల్‌..?

  • IndiaGlitz, [Monday,September 14 2020]

హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా 18 పేజీస్‌, కార్తికేయ‌2 చిత్రాలు రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నుండి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ త్వ‌ర‌లోనే నిఖిల్ త‌న సినిమాల షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. అంతే కాకుండా మ‌రో వైపు నిఖిల్ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నార‌ని సినీ వర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం నిఖిల్ స్క్రిప్ట్ త‌యారు చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా నిఖిల్ తెలియ‌జేశాడు. పూర్తిస్థాయి ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీగా నిఖిల్ సినిమాను చేయ‌బోతున్నాడ‌ట‌. పిల్ల‌లే ఈ చిత్రంలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతా ఓకే అయిన త‌ర్వాత త్వ‌ర‌లోనే నిఖిల్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌ట‌.

ప్ర‌స్తుతం జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా 18పేజీస్ సినిమా రూపొంద‌నుంది. అలాగే స‌స్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కార్తికేయ‌కు సీక్వెల్‌గా కార్తికేయ 2 తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 18 పేజీస్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే కార్తికేయ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

More News

పిక్ చూసి హీరో ఎవరో కనుక్కోగలరా?

లాక్‌డౌన్ తరువాత మన హీరోల పిక్ పెట్టి.. ఎలాంటి హింట్ ఇవ్వకుండా ఎవరో కనుక్కోండి అంటే కొందరిని గుర్తించగలం కానీ..

హీరో సూర్య కోర్టు ధిక్కార‌ణ చేస్తున్నారంటూ లేఖ‌!!

హీరో సూర్య సినిమాలే కాదు.. అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా పేద విద్యార్థుల‌కు స‌ర్వీస్ చేస్తుంటారు. అంతే కాదండోయ్‌..

ఐమాక్స్‌ థియేటర్‌ ఆపరేటర్ ఆత్మహత్య..

సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కొద్ది మంది మాత్రమే.. నటీనటులతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకు మించి ఒకరిద్దరు మినహా మనకు తెలియదు..

ప‌వ‌న్ 27 రేసులో మ‌రో టైటిల్‌..!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో

అఖిల్ రెడీ అవుతున్నాడు..!

అక్కినేని అఖిల్ ఈ ఏడాది వేస‌విలో ‘మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’తో సంద‌డి చేయాల‌నుకుటే క‌రోనా వైర‌స్ అడ్డం పడింది.