నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,October 08 2019]

యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్'  నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. ఈరోజు (8 - 10 - 2019 ) గం 10.49 ని..సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో  'రంగ్ దే' ప్రారంభమయింది.

చిత్ర నాయకా,నాయిక లు నితిన్, కీర్తిసురేష్ లపై సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ గారు క్లాప్ నిచ్చారు. చిత్రం స్క్రిప్ట్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) లు దర్శకుడు వెంకీ అట్లూరి కి అందచేశారు. కెమెరా స్విచ్ ఆన్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రగతి ప్రింటర్స్ అధినేత  శ్రీ పరుచూరి మహేంద్ర చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, జెమినికిరణ్,సుధాకర్ రెడ్డి,హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ..'ప్రేమ' తో కూడిన కుటుంబ కథాచిత్రమిదని దర్శకుడు వెంకీ అట్లూరి' తెలిపారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించటం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'రంగ్ దే' కి ఆయన స్వరాలు ఓ ఆకర్షణ అన్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూ గా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్ తదితరులు నటిస్తున్నారు.

More News

వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామాకి ముహుర్తం ఫిక్స్

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌`తో రెండు వ‌రుస విజ‌యాల‌ను చూశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఈ నేప‌థ్యంలో... వ‌రుణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సురేంద‌ర్ రెడ్డి చిత్రం?

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం

విదేశాల్లో 'అల వైకుంఠ‌పుర‌ములో' నెక్ట్స్ షెడ్యూల్‌

'జులాయి', `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్).

సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు'

సూపర్‌స్టార్‌ మహేష్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్‌ను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌