ఎన్టీఆర్ ఎంట్రీ అలా.. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇలా..

  • IndiaGlitz, [Tuesday,October 08 2019]

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్‌గా రూపొందుతోంది. అల్లూరి సీతారామరాజు, కొమ‌రం భీమ్ స్నేహం నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో కొమ‌రంగా తార‌క్‌, అల్లూరిగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న సినిమాల్లో క‌థానాయ‌కుల ప‌రిచ‌య స‌న్నివేశాన్ని ఓ స్థాయిలో ఆవిష్క‌రించే జ‌క్క‌న్న‌... ఈ మల్టీస్టార‌ర్ మూవీలో త‌న ఇద్ద‌రు హీరోల‌ను కూడా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్‌లో చాలా వీరోచితంగా చూపించ‌బోతున్నాడ‌ట‌.

కొమ‌రం భీమ్ పాత్ర పోషిస్తున్న య‌న్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ విష‌యానికి వ‌స్తే.. పులి ఫైట్‌తో స్క్రీన్ పై మెస్మ‌రైజింగ్ ఎంట్రీ ఉంటుంద‌ని తెలిసింది. ఇక అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్... వంద‌మందితో పోరాడి గెలిచిన వీరుడిలా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని సమాచారం. అంతేకాదు.. ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్‌లా ఉండే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ కోసం భారీ బ‌డ్జెట్‌నే కేటాయించార‌ని వినికిడి.

కాగా, డీవీవీ దాన‌య్య నిర్మాణంలో తెర‌కెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్‌'లో చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా.. కీల‌క పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... 2020 జూలై 30న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

More News

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' ప్రారంభం

యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది.

వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామాకి ముహుర్తం ఫిక్స్

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌`తో రెండు వ‌రుస విజ‌యాల‌ను చూశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఈ నేప‌థ్యంలో... వ‌రుణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సురేంద‌ర్ రెడ్డి చిత్రం?

`ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం

విదేశాల్లో 'అల వైకుంఠ‌పుర‌ములో' నెక్ట్స్ షెడ్యూల్‌

'జులాయి', `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్).