డిసెంబ‌ర్‌లో ప‌వ‌న్‌తో శ్రుతి..!

  • IndiaGlitz, [Sunday,November 08 2020]

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మాత‌లు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌, ఇత‌ర తారాగ‌ణంపై చిత్రీక‌ర‌ణ ఉంటుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ జోడీగా శ్రుతిహాస‌న్ క‌నిపించ‌నుంది. గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్, శ్రుతి క‌లిసి న‌టించే చిత్రమిదే అవుతుంది. ఇందులో శ్రుతి హాస‌న్ కాసేపే క‌నిపిస్తుంది. ప‌వ‌న్‌, శ్రుతి మ‌ధ్య ఉన్న స‌న్నివేశాల‌ను వ‌చ్చే నెల‌లో చిత్రీక‌రిస్తార‌ట‌. డిసెంబ‌ర్ నెల‌లో ప‌దిరోజుల షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణతో షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె న‌టించిన‌ ఒక్క సినిమా కూడా ద‌క్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి. లవ్ బ్రేకప్ కావడంతో శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాలు, మ్యూజిక్ కాన్‌స‌ర్ట్‌ల‌పై ఫోక‌స్ చేసింది. ఆ క్ర‌మంలో ఈమె రెండు తెలుగు సినిమాల‌కు ఓకే చెప్పింది. అందులో ఒక‌టి ‘క్రాక్’ సినిమా కాగా.. మ‌రో చిత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’.

More News

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో 'రాధేశ్యామ్‌'

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్పీడుగా ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్‌గా ఇటలీలో కీల‌క షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుందీ టీమ్‌. త‌దుప‌రి షెడ్యూల్‌కు

మెరిసిన కమల.. మురిసిన భారత్

అమెరికా చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం.. అమెరికా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు.. బైడన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు.. అమెరికాలో పాతుకుపోయిన జాతివివక్షను నిర్మూలిద్దాం...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ఘన విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించారు. తుది ఫలితం పెన్సెల్వేనియాలో ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.

దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలివే

ఇటీవలి కాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక మరొకటి లేదనే చెప్పాలి.

కేసీఆర్‌ను కలిసిన చిరు, నాగ్.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. నేడు ప్రగతి భవన్‌కు వెళ్లిన చిరు, నాగ్.