close
Choose your channels

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో 'రాధేశ్యామ్‌'

Sunday, November 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో రాధేశ్యామ్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్పీడుగా ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్‌గా ఇటలీలో కీల‌క షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుందీ టీమ్‌. త‌దుప‌రి షెడ్యూల్‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అందుకోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్‌ను రంగంలోకి దించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ‘ది లాస్ట్ స‌మురాయ్‌, గ్లాడియేట‌ర్‌, ది బోర్న్ ఐడెంటిటీ’ వంటి హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాలకు వ‌ర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ నిక్ పావెల్‌ను రంగంలోకి దించుతున్నార‌ట‌. దాదాపు రెండు కోట్ల రూపాయ‌లను ఖ‌ర్చు పెట్టి ఈ యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌.

పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌కుడిగా కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యాన‌ర్స్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా వ‌చ్చే ఏడాది వేస‌విలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్‌ స‌న్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.