ఆ మూడు సినిమాల్లో పాత్రలను వెల్లడించిన పూజా

  • IndiaGlitz, [Saturday,March 17 2018]

2018.. అందాల తార పూజా హెగ్డేకి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. వరుసగా ముగ్గురు స్టార్ హీరోల సరసన అవకాశాలను పట్టేసి.. టాలీవుడ్‌లో క్రేజియ‌స్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది ఈ భామ. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిలిమ్ (25వ చిత్రం).. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో పాటు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలతో చేసే సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవని చెబుతూనే.. వీటిలో త‌న‌ పాత్రల గురించి వెల్లడించారు పూజా. 

“మహేష్‌తో చేస్తున్న సినిమా ఓ కుటుంబకథా చిత్రం అయితే..  ఎన్టీఆర్ సినిమా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్. ఇక‌.. ద్విభాషా చిత్రంగా (తెలుగు, హిందీ) తెరకెక్కుతున్న ప్ర‌భాస్‌, 'జిల్' రాధాకృష్ణ చిత్రం ఓ ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో అంతర్లీనంగా ఒక సందేశం కూడా ఉంటుంద”ని తెలిపారు పూజా హెగ్డే. ఈ మూడు సినిమాలు కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక ఈమె.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన ‘సాక్ష్యం’ త్వరలో విడుదల కానుండగా.. ప్రత్యేక గీతంలో నర్తించిన ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

'రంగ‌స్థ‌లం' అంద‌రికీ న‌చ్చుతుంది..మిస్ అవ్వొద్దు: రామ్ చ‌ర‌ణ్

ప్ర‌ముఖ  ఐటీ కంపెనీ వర్చ్యూసా 'ది జోష్2018-అవ‌ర్ యాన్యువ‌ల్ ఎంప్లాయ్ ఎంగేజ్ మేంట్' (జోష్ ఫాంట‌సీ సెస‌న్-4)

'చిరు తేజ్ సింగ్' జీవిత చరిత్ర ఆధారంగా బాలల చిత్రం

నిర్మాత N.S NAIK గారి సహాయసహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్ సింగ్ జీవిత చరిత్ర

ఏప్రిల్ 5 న 'ఆచారి అమెరికా యాత్ర' విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 5 న విడుదల కానుంది.

ర‌వితేజ స‌ర‌స‌న ఎమ్మెల్యే?

ఎన్నిక‌లు రాబోతున్న వేళ ఎమ్మెల్యే, మంత్రి అనే ప‌దాలు విన‌గానే వాటిని ఆధారంగా చేసుకునే క‌థ‌లు అల్లేసుకున్నారేమో అనే అనుమానం వ‌స్తుంది.

'సైరా'లో నాజ‌ర్ పాత్ర ఏంటంటే..

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర‌తో తెర‌కెక్కుతున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'.