close
Choose your channels

ఆ మూడు సినిమాల్లో పాత్రలను వెల్లడించిన పూజా

Saturday, March 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ మూడు సినిమాల్లో పాత్రలను వెల్లడించిన పూజా

2018.. అందాల తార పూజా హెగ్డేకి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. వరుసగా ముగ్గురు స్టార్ హీరోల సరసన అవకాశాలను పట్టేసి.. టాలీవుడ్‌లో క్రేజియ‌స్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది ఈ భామ. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిలిమ్ (25వ చిత్రం).. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో పాటు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలతో చేసే సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవని చెబుతూనే.. వీటిలో త‌న‌ పాత్రల గురించి వెల్లడించారు పూజా. 

“మహేష్‌తో చేస్తున్న సినిమా ఓ కుటుంబకథా చిత్రం అయితే..  ఎన్టీఆర్ సినిమా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్. ఇక‌.. ద్విభాషా చిత్రంగా (తెలుగు, హిందీ) తెరకెక్కుతున్న ప్ర‌భాస్‌, 'జిల్' రాధాకృష్ణ చిత్రం ఓ ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలో అంతర్లీనంగా ఒక సందేశం కూడా ఉంటుంద”ని తెలిపారు పూజా హెగ్డే. ఈ మూడు సినిమాలు కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక ఈమె.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటించిన ‘సాక్ష్యం’ త్వరలో విడుదల కానుండగా.. ప్రత్యేక గీతంలో నర్తించిన ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.