'క్వీన్'.. దర్శకుడు మారుతున్నాడా?

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

2014లో హిందీలో వచ్చిన క్వీన్' సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, మళయాళ భాషల్లో దర్శకుడు నీలకంఠ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హిందీలో క్వీన్'గా నటించిన కంగనా రనౌత్ పాత్రని తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్ పోషిస్తున్నారు.

తాజాగా తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫ్రాన్స్‌లో చిత్రీకరణని కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం.. ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమా చిత్రీకరణ విషయంలో నీలకంఠ, తమన్నాల మధ్య విబేధాలు తలెత్తడంతో నీలకంఠ ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుంచి రాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని...మను కుమరన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... మలయాళం వెర్షన్ కి సంబంధించి మాత్రం నీలకంఠ దర్శకుడిగా కొనసాగనున్నారని సమాచారం.

More News

సంక్రాంతికి అన్నపూర్ణ సంస్థ పెట్టే పొంగళి 'రంగులరాట్నం'

2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం','హలో' వంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.

ఏప్రిల్ లో రానున్న సుమంత్ కొత్త చిత్రం

గతేడాది విడుదలైన ‘మళ్ళీ రావా’ సినిమాతో చాలా రోజుల తర్వాత విజయాన్ని చవి చూశాడు కథానాయకుడు సుమంత్.

'2.O' నిడివి ఎంతంటే..

శివాజీ,రోబో వంటి రెండు వరుస విజయాల తరువాత సూపర్ స్టార్ రజనీ కాంత్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో

సమంత కథానాయిక.. సిమ్రాన్ విలన్..

సిమ్రాన్..తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో నెంబర్ వన్ కథానాయికగా రాణించిన నిన్నటి తరం హీరోయిన్.

నిహారిక సినిమా పూర్తయ్యింది

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే.