అక్కడ రాశి హవా!

  • IndiaGlitz, [Monday,January 07 2019]

తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈమధ్య ఆమె నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. అంతే కాదు అక్కడి స్టార్ హీరోలందరితోనూ నటిస్తోంది. తొలి చిత్రంలోనే నయనతార, విజయ్‌సేతుపతి, అధర్వ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం వరించడం, ఆ చిత్రం సక్సెస్ కావడంతో రాశీఖన్నా పేరు పాపులర్ అయింది.

అలాగే జయం రవితో కలిసి 'అడంగామరు' చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా విజయం సాధించడంతో రాశీ గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. 'ఇమైకానోడిగళ్' చిత్రంలో నటించినా నయనతార, విజయ్‌సేతుపతిలతో కలిసి నటించే అవకాశం లేకపోవడం బాధాకరమేనంది. అయితే విజయ్‌సేతుపతికి జంటగా నటించాలని తాను కలలు కంటున్నానని చెబుతోంది రాశి.

ఇక నటుడు విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన తెరి, మెర్శల్ చిత్రాలను చూశానని, వారి కాంబినేషన్ అంటేనే యమ క్రేజ్ అని పేర్కొంది. ఆ కాంబినేషన్‌లో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని రాశీఖన్నా చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విశాల్‌కు జంటగా 'అయోగ్య', సిద్ధార్థ్‌తో 'సైతాన్ కా బచ్చా' చిత్రాల్లో నటిస్తోంది.

More News

'పి.ఎం.నరేంద్ర మోదీ' ఫస్ట్ లుక్

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల బయోపిక్స్ రూపొందుతున్నాయి.

క‌మ‌ల్‌తో దక్షిణ కొరియా భామ

కమ‌ల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'ఇండియన్ 2'. 22 ఏళ్ల తర్వాత వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

100 థియేట‌ర్స్‌లో విగ్ర‌హాలు

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

పెళ్లి త‌ర్వాత తొలిసారి దీప్‌వీర్‌

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌, హీరోయిన్ దీపికా ప‌దుకొనెలు గత ఏడాది న‌వంబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు వీరిద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టించారు.

అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్ కుక్క‌లా..పందులా

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత‌లుగా రాణిస్తున్న అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేష‌న్స్ వారిని నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని కుక్క‌లు అంటూ మాట్లాడాడు.