స్లిమ్‌గా మారిపోయిన రాశిఖన్నా.. అభిమానులకో మెసేజ్..

  • IndiaGlitz, [Wednesday,February 10 2021]

ఇటీవలి కాలంలో బొద్దుగుమ్మలంతా ముద్దుగుమ్మల్లా మారి అభిమానుల ముందుకు వస్తున్నారు. ఎంతో బొద్దుగా ఉండే నమిత.. చాలా స్లిమ్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్ అవికా గోర్ సైతం ఫిజిక్‌పై దృష్టి సారించి బాగా వర్కవుట్స్ చేసి స్లిమ్‌గా మారి ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బొద్దుగుమ్మ కూడా స్లిమ్‌గా తయారైంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో అంతా ఫిజిక్‌పై కాన్సన్‌ట్రేట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫిజిక్‌పై దృష్టి సారించి ఔరా అనిపించింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొన్న పిక్స్‌ను రాశి పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో రాశి చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు ఓ మంచి మెసేజ్‌ను కూడా అభిమానుల కోసం రాశి ఇచ్చింది. వ్యాయామం అనేది మన శరీరాన్ని ద్వేషించడం కారణంగా చేయకూడదని.. శరీరంపై ఉన్న ప్రేమతో చేయాలని రాశి పోస్టులో తెలిపింది. అలాగే క్రాష్ డైట్స్ చేయవద్దని రాశి అభిమానులకు సూచించింది.

‘‘ఫిట్‌నెస్ పరంగా ఇది నాకు గ్రిల్లింగ్ ఇయర్. కఠినమైన, ఆరోగ్యకరమైన డైట్‌తో తనను పూర్తి స్థాయిలో నాజూకుగా మారుస్తానని నా ట్రైనర్ కుల్దీప్ సేతి తనకు ప్రామిస్ చేశారు. ప్రస్తుతం నేనిలా ఉన్నాను. నేను అనుకున్న దానిని సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేనిలా మారడానికి సాయం చేసిన ట్రైనర్స్ కుల్దీప్, రాజేష్‌లకు ధన్యవాదాలు. ఇంకా చాలా మారాలి. ఈ పోస్టు చదివిన వారందరికీ.. వర్కవుట్స్ అనేవి మీ శరీరంపై అసహ్యంతో చేయవద్దు.. ప్రేమతో చేయండి. అలాగే దయచేసి క్రాష్ డైట్స్ చేయవద్దు. అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడం ఎప్పుడూ చాలా ఇంపార్టెంట్. ‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్!’’ అని రాశి పోస్టులో పేర్కొంది.

More News

స్నేహితుడిని కలవడానికి వెళ్తే కొన్ని గంటల్లోనే రూ.కోటి లాటరీ..

ఫేస్‌బుక్ స్నేహానికి అత్యంత విలువ ఇచ్చాడు. కర్ణాటక నుంచి కేరళకు ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు.

దిశ కేసులో కీలక మలుపు.. తమను బెదిరిస్తున్నారంటూ..

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రలోభ పెడుతున్నారంటూ..

ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'లో ఫాద‌ర్‌-స‌న్ రిలేష‌న్‌షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది - హీరో రామ్ కార్తీక్‌

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న,

షర్మిల రాజకీయ పార్టీ.. జగన్‌కు పెద్ద దెబ్బే..

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో నూతన పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘నాట్యం’ టీజర్: నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో