close
Choose your channels

దిశ కేసులో కీలక మలుపు.. తమను బెదిరిస్తున్నారంటూ..

Wednesday, February 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రలోభ పెడుతున్నారంటూ.. దిశ కమిషన్‌ను ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఇటీవల దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలున్నాయని
చెన్నకేశవులు తల్లి వెల్లడించింది. దిశ కేసులో కీలక విషయాలు బయట పెడతానని చెప్పడంతో.. కూర్మయ్యకు గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్ చేశారని ఆమె ఆరోపిస్తోంది.

హైకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నారని దిశ నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దిశ కేసులో శ్రీనివాస్‌రెడ్డిని పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని కమిషన్ ఎదుట దిశ నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసును వెనక్కి తీసుకోవాలని తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అనుమానాలన్నీ అఫిడవిట్ రూపంలో కమిషన్ ఎదుట ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. దిశ కేసు దర్యాప్తులో భాగంగా.. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి పోలీసులు తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకనస్ట్రక్షన్ నిర్వహిస్తుండగానే అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏం లేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు నిందితులుగా ఉన్న నలుగురూ అక్కడికక్కడే చనిపోయారు. దిశను హత్య చేసిన స్థలంలోనే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.