ఏ నటి కూడా ఇలాంటి పాత్ర చేయలేదు - రమ్యశ్రీ

  • IndiaGlitz, [Monday,April 11 2016]

రమ్యశ్రీ ప్రధానపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఓమల్లి'. ఆర్.ఎ.ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల అవుతుంది.

ఈసందర్భంగా...

రమ్య శ్రీ తన సినిమా విశేషాలను గురించి మాట్లాడుతూ 'నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక ఘటనను చూశాను. ఆ ఘటన నా మనసులో అలాగే నిలిచిపోయింది. నేటి సమాజంలో ఆడవాళ్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిపై నేను సినిమా చేయాలనుకోగానే ఈ ఘటన నా మదిలో మెదిలింది. దాన్ని స్క్రిప్ట్ గా మలిచాను. మెసేజ్, కమర్షియల్ గా సినిమాను తెరకెక్కించాను. ఒకవైపు నిర్మిస్తూ, దర్శకత్వం చేశాను. నటించాను. చాలా కష్టపడ్డాను.

అయితే అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాను చూసిన వాళ్ళందరూ చాలా బావుందని అంటున్నారు. ఏ నటి కూడా ఇలాంటి రోల్ చేయలేదని చాలెంజ్ చేసి చెప్పగలను. సినిమా రిలీజ్ సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలు, తర్వాత థియేటర్స్ సమస్య కారణంగా సినిమాను రిలీజ్ చేయడంలో ఆలస్యమైంది. అయితే కొన్ని రోజులు వెయిట్ చేయడంతో సినిమాను వంద థియేటర్స్ లో విడుదల చేస్తున్నాను. సినిమాను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాను. దీని తర్వాత మరో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి'' అన్నారు.

More News

నాని టైటిల్ ఫిక్సయింది...

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

దీపికా ప్రియుడితో తమన్నా...

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రియుడు,హీరో రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ షెట్టి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.

వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పోలీసోడు

తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం తెరి.ఈ చిత్రాన్ని రాజా రాణి ఫేం అట్లీ తెరకెక్కించారు.

నిత్యా..తెలుగువారికి మాత్రమే

కేరళ కుట్టి నిత్యా మీనన్ మంచి నటి మాత్రమే కాదు..మంచి గాయని కూడా.

సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్డ్ డే కలెక్షన్స్..

పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది.