close
Choose your channels

తమిళ హీరో ఫస్ట్ తెలుగు మూవీ.. హీరోయిన్ గా రష్మిక మందన?

Tuesday, July 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ హీరోలు ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇళయదళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయి. క్రేజీ హీరో ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

వీరిద్దరి బాటలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ నడవనున్నాడు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో నటించేందుకు శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతి రత్నాలు చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శివకార్తికేయన్, అనుదీప్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి సంస్థ నిర్మించనుంది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఎంపికైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనుదీప్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నాడు. రష్మిక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

తమిళంలోకి కూడా రష్మిక కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు రానున్నాయి. శివకార్తికేయన్ తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.