‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమనే అంచనాలు రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం వస్తుండటంతో అభిమానులు, నటీనటులు, సినీ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలచేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్‌ కిరాక్ అనిపిస్తున్నాయి. ఆగస్టు 30న ‘సాహో’ను థియేటర్లలోకి తీసుకొస్తోంద చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వైపు సోషల్ మీడియాలో మరోవైపు మీడియా ద్వారా ఇంటర్వ్యూలతో సినిమా యూనిట్ హడావుడి చేస్తోంది.

అయితే ఇంతవరకూ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్‌ను మాత్రం ‘సాహో’ జరుపుకోలేదు. మరికొన్ని రోజులు సినిమా విడుదల కానున్నప్పటికీ ప్రమోషన్ మాత్రం సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది. అయితే తాజాగా ఫిల్మ్‌నగర్ ప్రీ రిలీజ్ ‌ఈవెంట్ గురించి ఓ పుకారు షికారు చేస్తోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల మధ్య చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. కాగా భారీ వేడుకకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెద్ద ఎత్తున అభిమానులు, సెలబ్రిటీలు వస్తారని అందుకే రామోజీ ఫిల్మ్ సిటీ అయితే అనువుగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోందట.

ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేయాలని దర్శకనిర్మాతలు యోచిస్తున్నారట. కాగా ప్రస్తుతం ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్‌ నుంచి ఎవరెవర్ని పిలవాలి..? ఎవర్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలి..? అని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. అయితే ఈ ఈవెంట్‌పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడెప్పుడో ‘బాహుబలి’గా ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్‌ మీట్‌‌లలో ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్‌, సినీ ప్రియులు.. ‘సాహో’గా ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా రోజులుగా ప్రభాస్‌ను చూద్దామనుకున్న అభిమానులు ఈ గుడ్‌న్యూస్ తెలుసుకుని ఆనందంలో మునిగి తేలుతున్నారట. మరి ఈ ఈవెంట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

'రణరంగం' సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

ముందుగానే `రూలర్` వచ్చేస్తున్నాడా?

బాల‌య్య రౌడీయా?  పోలీసా?  రౌడీగా రూల్ చేస్తారా?  పోలీస్‌గా రూల్ చేస్తారా?  ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూల‌ర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహ‌లంగా ఉంది.

ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిపిన రాజశేఖర్

నాలుగేళ్లు ఎంబిబిఎస్ చదివి, తర్వాత ఓ ఏడాది హౌస్ సర్జన్ గా సేవలు చేస్తే ప్రభుత్వం డాక్టర్ పట్టా చేతికి వస్తుంది.

తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన సెన్సేషన్ డైరెక్టర్

మహానటి సావిత్రి బయోపిక్ `మహానటి` సెన్సేషనల్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

'ఇండియన్ 2' కోసం కాజల్ కష్టాలు

హీరోలు, హీరోయిన్లను చూసి వీరికేం బాగానే ఉన్నారుగా? అని మనం అనుకుంటాం. కానీ వారు ప్రేక్షకులను మెప్పించడానికి..