close
Choose your channels

తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన సెన్సేషన్ డైరెక్టర్

Wednesday, August 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చిన సెన్సేషన్ డైరెక్టర్

మహానటి సావిత్రి బయోపిక్ `మహానటి` సెన్సేషనల్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. `ఎవడే సుబ్రమణ్యం`తో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నాగి... `మహానటి`తో టాప్ డైరెక్టర్ అయ్యాడు. స్టార్ హీరోలందరూ ఈయనతో కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ ఏ మాత్రం తొందరపడలేదు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత తదుపరి సినిమాను ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ ఎవరనేది చెప్పలేదు కానీ.. తన సినిమా సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని పేర్కొన్న ఈ యువ దర్శకుడు తన సినిమా కోసం పనిచేయడానికి స్క్రిప్ట్ రైటర్స్, డిజైనర్స్ , విజువల్ ఆర్టిస్టులు కావాంటూ ప్రకటన కూడా ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా వైజయంతీ మూవీస్ నిర్మించనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.