close
Choose your channels

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

Saturday, March 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

మెగా మేనల్లుడు సాయి థరమ్ తేజ్.. హీరోగా కాకుండా మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ లాంఛ్ చేశాడు. తన తల్లి విజయదుర్గ పేరుతో (Vijay Durga Productions) నూతనంగా ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లోగోను విడుదల చేశాడు. ఈ మేరకు మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

"నా మాతృమూర్తి విజయదుర్గ గారికి చిన్న బహుమతిగా ఆమె పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ ప్రారంభించాను. మా మావయ్యలు చిరంజీవి, నాగబాబు, నా గురువు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్‌ తొలినాళ్లలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు, నా మిత్రులు నవీన్ విజయ్‌కృష్ణ, హర్షిత్ శ్రీ, ‘సత్య’ టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని తెలిపాడు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

మరోవైపు తన పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నట్లు వెల్లడించాడు. ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌న త‌ల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌(Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపాడు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు చెప్పాడు. గతంలో కూడా త‌న పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. 2021లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయిన అనంత‌రం సాయితేజ్ అని పేరు మార్చుకున్నాడు. ఇక తాజాగా మ‌ళ్లీ సాయిదుర్గ తేజ్‌గా ఛేంజ్ చేసుకున్నాడు.

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

ఇక తేజ్ సినిమాల విషయానికొస్తే గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో వ‌స్తున్న 'గాంజా శంకర్‌'లో న‌టిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తేజ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో చూపించబోతున్నారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.