close
Choose your channels

యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

Saturday, February 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

యాదాద్రి పైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, స్మారక టవర్లు (గోపురాలు), ఊపిరి తీసుకునే శిల్పాలు, మండపాలు, ప్రాకారాలు, స్తంభాల వరకూ ప్రతిదీ అద్భుతమే. ఇంతటి అద్భుతానికి సృష్టికర్త ఆనంద్ సాయి. గత ఐదేళ్లుగా యాదాద్రి ఆలయ డిజైనింగ్‌ కోసం శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావొచ్చిన సందర్భంగా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అద్భుతమైన దైవకార్యంలో తాను భాగస్వామి అయినందుకు పెట్టిపుట్టానని తెలిపారు.

ఇంకా ఆనంద్ సాయి మాట్లాడుతూ..‘‘గత ఐదేళ్లుగా నేను పూర్తిగా యాదాద్రి ఆలయానికే అంకితమయ్యాను. ఈ దైవకార్యం పూర్తయ్యే వరకూ నేను ఏ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. ఈ ఆలయానికి సంబంధించిన వర్క్ నాకు దక్కడమనేది గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ వర్క్ అప్పజెప్పిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నోసార్లు కేసీఆర్‌గారు ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఏదో ఒక ఆసక్తికరమైన ఐడియాతో వచ్చేవారు. సీఎం సర్ ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆసక్తి కనబరిచడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు’’ అని వెల్లడించారు. ఆనంద్ ప్రస్తుతం కొత్త సచివాలయ ప్రాంగణంలో వస్తున్న ఆలయాన్ని కూడా రూపొందించారు.

యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

నాలుగు రకాల శైళులను సంతరించుకున్న ప్రపంచంలోనే తొలి ఆలయం యాదాద్రి కావడం విశేషం. పల్లవ, చాళుక్య, ద్రవిడియన్, కాకతీయుల శైలిని ఆలయ నిర్మాణంలో వాడినట్టు ఆనంద్ సాయి వెల్లడించారు. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో గుంటూరు నుంచి తీసుకొచ్చిన నల్లటి గ్రానైట్ రాయిని ఉపయోగించినట్టు తెలిపారు. ఆగమన శాస్త్రానుసారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ ఆలయ డిజైనింగ్ కోసం తాను విస్తృతమైన పరిశోధన చేయాల్సి వచ్చిందని.. ఆలయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి తాను అనేక ఆగ్నేయాసియా దేశాలను సందర్శించానని.. చివరికి యాదాద్రి కోసం అనేక డిజైన్లతో ముందుకు వచ్చానని ఆనంద్ వెల్లడించారు.

అలాగే చిన్న జీయర్ స్వామితో కలిసి పనిచేయడం గురించి ఆనంద్ సాయి మాట్లాడుతూ.. ‘‘చిన్న జీయర్ స్వామీజీతో కలిసి పనిచేయడం చాలా సంతృప్తికరంగా అనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో ప్రయాణం నన్ను మరింత ఆధ్యాత్మికం వైపు నడిపించింది. ఆయనతో పనిచేసిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మిక ప్రకంపనలు, అనుభవాలు నా జీవితాన్నే మార్చేశాయి” అని తెలిపారు. ఈ ప్రాజెక్టులో తనతో కలిసి పని చేసిన వారి గురించి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు నాలెడ్జ్ షేరింగ్ బాగా జరిగేది. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగే అనుభవం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను’’ అని వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.