'జంబ‌ల‌కిడి పంబ‌' సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

'గీతాంజలి', 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం 'జంబ‌ల‌కిడి పంబ‌'. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు.

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ '' క‌థ న‌చ్చి చేసిన చిత్ర‌మిది. మా సినిమాకు 'జంబ‌ల‌కిడి పంబ‌' టైటిల్ చాలా చ‌క్క‌గా కుదిరింది. టైటిల్ చూసి సినిమాకు వ‌చ్చిన‌ వారికి నిరాశ క‌ల‌గ‌దు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా తెర‌కెక్కించారు'' అని తెలిపారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ '' రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ వ‌చ్చింది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం'' అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ '' ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి'' అని తెలిపారు.

న‌టీన‌టులు: స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు. సాంకేతిక నిపుణులు: సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

More News

నాని, త్రివిక్ర‌మ్ చిత్రానికి నిర్మాత ఎవ‌రంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాల‌య్య ఖాతాలో మ‌రో ఫ్యాక్ష‌న్ మూవీ

తెలుగునాట ఫ్యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడిగా ట్రెండ్ సృష్టించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. స‌మ‌ర‌సింహారెడ్డితో మొద‌లుపెట్టి న‌ర‌సింహనాయుడు, సీమ సింహం, చెన్న‌కేశ‌వ రెడ్డి..

'తేజ్‌' చిత్రం డెఫినెట్‌గా అందర్నీ అలరిస్తుంది - సాయిధరమ్‌ తేజ్‌

'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్న సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా 'తేజ్‌'

మ‌హేష్ సినిమాలోనూ అలాగే..

ద‌ర్శ‌కుడిగా త‌న తొలి ప్ర‌య‌త్నం 'మున్నా' నిరాశ‌ప‌రిచినా.. బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్నారు వంశీ పైడిప‌ల్లి.

మ‌ళ్ళీ బిజీ అవుతున్న నివేదా

రెండేళ్ళ క్రితం విడుద‌లైన జెంటిల్ మ‌న్ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నివేదా థామ‌స్‌. ఆ త‌రువాత నిన్ను కోరి, జై ల‌వ కుశ చిత్రాలు చేసింది.