close
Choose your channels

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: బండి సంజయ్

Tuesday, November 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: బండి సంజయ్

బీజేపీకి భయపడి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిన్న మేనిఫెస్టోను విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలను పట్టించుకోని కేసీఆర్‌ మొదటిసారిగా మేనిఫెస్టోను విడుదల చేశారని విమర్శించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకోగానే... పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మేనిఫెస్టోలో ఏం చెప్పారో, ఇప్పుడు అదే చెప్పారన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులను మరోసారి మోసం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. గ్రేటర్ మహిళల గాజుల శబ్దానికి కేసీఆర్, కేటీఆర్, ఓవైసీ చెవుల నుంచి రక్తం కారాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చి బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.