Chandrababu Naidu:రజనీపై ఘాటు విమర్శలు.. వైసీపీ నేతలపై తలైవా ఫ్యాన్స్ గరం, స్పందించిన చంద్రబాబు

  • IndiaGlitz, [Monday,May 01 2023]

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఇటీవల విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం, ఆయనతో తనకున్న అనుబంధాన్ని రజనీ గుర్తుచేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు విజన్, పరిపాలన తదితర అంశాలపై సూపర్‌స్టార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని అధికార వైసీపీకి చెందిన నేతలు భగ్గుమన్నారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్న రజనీ ఫ్యాన్స్ :

అయితే రజనీని టార్గెట్ చేసి ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం వివాదాస్పదమైంది. దీంతో సూపర్‌స్టార్ అభిమానులు రెచ్చిపోయారు. తక్షణం తమ అభిమాన నటుడికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలు సహించరని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి....జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి ’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More News

Choreographer Chaitanya:'ఢీ' కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. వాళ్లకు రుణపడి వుంటా, సెల్ఫీ వీడియో వైరల్

ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో 'ఢీ'లో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు.

KCR:తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఆరు కీలక ఫైళ్లపై తొలి సంతకం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

Venkat:వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం!!

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

Rashmika:అక్క కోసం ఒంటరిగా చెన్నైకి.. ‘‘రెయిన్‌ బో’’ సెట్స్‌లో చెల్లితో రష్మిక సందడి, ఆ హగ్స్ ది బెస్ట్ అన్న నేషనల్ క్రష్

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి.

Rajinikanth:ఎన్టీఆర్‌లా మేకప్ వేసుకున్నా.. నా ఫ్రెండ్ కోతిలా వున్నానని అన్నాడు, 2024లో చంద్రబాబు గెలిస్తే : రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు సూపర్‌స్టార్ రజనీకాంత్. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో