అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్

  • IndiaGlitz, [Wednesday,June 20 2018]

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి మూవీస్ సంస్థ‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ‘చిన్నోడు పెద్దోడు’, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘ఊయల’, ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ‘సమ్మోహనం’ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది.

అదేమిటంటే.. ఈ సినిమా విడుద‌లైన‌ జూన్ 15నే 17 ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా శ్రీ‌దేవి మూవీస్ నిర్మించిన ‘భలేవాడివి బాసూ!’ రిలీజైంది. అప్పట్లో ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే తేదీకి ‘సమ్మోహనం’ సినిమాని విడుదల చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. అంటే.. ఒకే తేది ఒక‌సారి మైన‌స్ రిజ‌ల్ట్ ఇస్తే.. మ‌రోసారి పాజిటివ్ రిజ‌ల్ట్ ఇచ్చింద‌న్న‌మాట‌.

More News

సుమంత్ సినిమా సిద్ధ‌మ‌వుతోంది

గ‌తేడాది విడుద‌లైన ఫీల్‌గుడ్ మూవీ 'మ‌ళ్ళీ రావా'తో చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని అందుకున్నారు సుమంత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

విశాల్‌ 'అభిమన్యుడు'ని అభినందించిన సూపర్‌స్టార్‌ మహేష్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై ఎమ్‌.

జులై 6 వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలొ నిర్మిస్తున్న చిత్రం 'దివ్య మణి'.

డా.వై ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌ "యాత్ర" షూటింగ్ ప్రారంభం

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా 'పేపర్ బాయ్'.