close
Choose your channels

అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్

Wednesday, June 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి మూవీస్ సంస్థ‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ‘చిన్నోడు పెద్దోడు’, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘ఊయల’, ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ‘సమ్మోహనం’ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది.

అదేమిటంటే.. ఈ సినిమా విడుద‌లైన‌ జూన్ 15నే 17 ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా శ్రీ‌దేవి మూవీస్ నిర్మించిన ‘భలేవాడివి బాసూ!’ రిలీజైంది. అప్పట్లో ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే తేదీకి ‘సమ్మోహనం’ సినిమాని విడుదల చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. అంటే.. ఒకే తేది ఒక‌సారి మైన‌స్ రిజ‌ల్ట్ ఇస్తే.. మ‌రోసారి పాజిటివ్ రిజ‌ల్ట్ ఇచ్చింద‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.