ముగ్గురు హీరోల‌కూ కీల‌క‌మే..

  • IndiaGlitz, [Thursday,May 17 2018]

వ‌చ్చే శుక్ర‌వారం (మే 25) మూడు తెలుగు సినిమాలు సంద‌డి చేయనున్న సంగ‌తి తెలిసిందే. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ, మాళవికా శర్మ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నేల టిక్కెట్టు'.

ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఇక ఇదే రోజున నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'నా నువ్వే' కూడా రిలీజ్ కానుంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మించింది.

అలాగే.. ఈ రెండు సినిమాలతో పాటు 'అమ్మమ్మగారిల్లు' విడుద‌ల కానుంది. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాతో సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఆర్. రాజేష్ సంయుక్తంగా నిర్మించారు.

ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు హీరోలు నటించిన గత చిత్రాలు (రవితేజ – 'టచ్ చేసి చూడు', కళ్యాణ్ రామ్ 'ఎం.ఎల్.ఎ', నాగశౌర్య – 'కణం') ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. తాజా చిత్రాల ఫ‌లితాలు వారికి కీల‌కంగా మారాయి.

More News

'ఆఫీసర్’ సినిమా వ్య‌వ‌థి ఎంతంటే..

కింగ్ నాగార్జున కథానాయకుడిగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన‌ సినిమా ‘ఆఫీసర్’.

సూర్య 38వ చిత్రానికి ప్రారంభమైన మ్యూజిక్ సిట్టింగ్స్

తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ‘ఎన్జీకే’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న‌ విషయం తెలిసిందే.

మ‌ల్ల‌యోధుని బ‌యోపిక్‌లో రానా

5000 కి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గారు.

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌...?

టాలీవుడ్ ఉన్న‌ట్టుండి స్టార్ డ‌మ్ సంపాదించుకుని.. చూస్తుండ‌గానే పాతాళానికి ప‌డిపోయిన హీరోల్లో ఉద‌య్‌కిర‌ణ్ ఒక‌రు.

బాలీవుడ్‌కి 'మ‌హాన‌టి'

కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `మ‌హాన‌టి`.