close
Choose your channels

ముగ్గురు హీరోల‌కూ కీల‌క‌మే..

Thursday, May 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముగ్గురు హీరోల‌కూ కీల‌క‌మే..

వ‌చ్చే శుక్ర‌వారం (మే 25) మూడు తెలుగు సినిమాలు సంద‌డి చేయనున్న సంగ‌తి తెలిసిందే. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ, మాళవికా శర్మ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నేల టిక్కెట్టు'.

ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఇక ఇదే రోజున నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'నా నువ్వే' కూడా రిలీజ్ కానుంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మించింది.

అలాగే.. ఈ రెండు సినిమాలతో పాటు 'అమ్మమ్మగారిల్లు' విడుద‌ల కానుంది. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాతో సుందర్ సూర్య దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఆర్. రాజేష్ సంయుక్తంగా నిర్మించారు.

ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు హీరోలు నటించిన గత చిత్రాలు (రవితేజ – 'టచ్ చేసి చూడు', కళ్యాణ్ రామ్ 'ఎం.ఎల్.ఎ', నాగశౌర్య – 'కణం') ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. తాజా చిత్రాల ఫ‌లితాలు వారికి కీల‌కంగా మారాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.