'విఠల్ వాడి' మార్చి 20న విడుదల

  • IndiaGlitz, [Thursday,March 12 2020]

ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్, కైషా రావత్ హీరో హీరోయిన్లు గా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం విట్ఠల్ వాడి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. రోహిత్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. కైషా రావత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమిత్ , రోల్ రిడా అప్పాజీ అంబరీష్ దర్బా
చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడుతూ... విట్టల్ వాడి సినిమా కొన్ని వస్తావ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించబడింది.మమ్మల్ని నమ్మి నరేష్ గారు ఈ సినిమాను నిర్మించినందుకు ధన్యవాదాలు. జయశ్రీ గారు, అప్పాజీ గారు ఇలా అందరూ ఈ సినిమాలో బాగా నటించారు. డైరెక్టర్ నాగేంద్ర సినిమాను బాగా తీశారు. అందరికి నచ్చే సినిమా అవుతుందనని భావిస్తున్నాను. మార్చి 20న విడుదలవుతున్న మా సినిమాను అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ కైషా రావత్ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. హీరో రోహిత్ తో వర్క్ చెయ్యడం మర్చిపోలేను అనుభూతి. విఠల్ వాడి ఒక మంచి లవ్ స్టొరీ, సరదాగా సాగే కథ ఇది, యూత్ ఫుల్ ఎంటర్త్సైన్మెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ విజయం సాధిస్తుందని భావిస్తున్నాను అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ మాట్లాడుటూ... ఈ కథను నాగేంద్ర మాకు చెప్పినప్పుడు నచ్చి కొంత రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశాము. డైరెక్టర్ నాగేంద్ర పక్కా స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది, సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ... నిర్మాత నరేష్ గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయన చెప్పిన ఒక పాయింట్ ను తీసుకొని విఠల్ వాడి సినిమా తీయడం జరిగింది. హీరో రోహిత్ ఈ కథకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు, కొత్త హీరో అయినా అనుభవం కలిగిన నటుడిలా నటించాడు, అబ్బాజీ గారు ఈ కథ విని సినిమా ఒప్పుకున్నారు. సినిమా అంతా బాగా వచ్చింది, మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాలు అన్ని అంశాలు ఉన్నాయి. కొత్త సినిమాలను సపోర్ట్ చేస్తే మా లాంటి కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు. మమ్మల్ని మొదటినుండి ప్రోత్సహిస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత నరేష్ మాట్లాడుతూ... సహజమైన కథ కథనాలతో సాగే సినిమా ఇది. హ్యాపీగా నవ్వుతూ చూడొచ్చు, డైరెక్టర్ నాగేంద్ర బాగా తీసాడు, హీరో రోహిత్ నటన ప్రధాన బలం. సంగీతం, కెమెరా వర్క్ అన్ని ఈ సినిమాకు బాగా కుదిరాయి. కొన్ని రియల్ ఇన్సెడెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు.

More News

'నీకు మాత్రమే చెప్తా' టాక్ షో ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా - తరుణ్ భాస్కర్

పి.పి ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హోస్ట్ చేస్తోన్న టాక్ షో ‘‘నీకు మాత్రమే చెప్తా’’. ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ ఈ కార్యక్రమానికి నిర్మాతలు.

'ఒరేయ్‌ బుజ్జిగా...' 100 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్ పక్కా - కె.కె.రాధామోహన్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ప్ర‌భాస్‌20...ఒక సీన్‌కే రెండు కోట్లు

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

విశాల్‌, మిస్కిన్.. కొన‌సాగుతున్న వివాదం

హీరో విశాల్‌, డైరెక్ట‌ర్ మిస్కిన్ మ‌ధ్య డిటెక్టివ్ 2కి సంబంధించిన వివాదం కొన‌సాగుతూనే ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో

పూణేకు ‘ఆర్ఆర్ఆర్‌’

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.