close
Choose your channels

ప్ర‌భాస్‌20...ఒక సీన్‌కే రెండు కోట్లు

Thursday, March 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్‌20...ఒక సీన్‌కే రెండు కోట్లు

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఓ డియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం జార్జియాలో చిత్రీక‌రణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల చిత్ర నిర్మాత‌లు ఓ ఛేజింగ్ సీన్‌ను ప్ర‌భాస్‌పై చిత్రీక‌రించామ‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. స‌మాచారం మేర‌కు ఈ ఛేజింగ్ సీన్‌ను స్పెష‌ల్‌గా రెండు కోట్లు ఖ‌ర్చు పెట్టి వేసిన మార్కెట్ సెట్‌లో చిత్రీక‌రించార‌ట‌.

ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ ఈ సెట్‌ను ప‌ది రోజుల పాటు 150 మంది యూనిట్ స‌భ్యుల‌తో క‌ష్ట‌ప‌డి రూపొందించాడు. ఈ ఛేజింగ్ సీన్ సినిమాలో ఓ సీన్‌లో మాత్ర‌మే క‌న‌ప‌డుతుంద‌ట‌. దాని కోసం రెడు కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం గొప్ప విష‌య‌మేన‌ని అంద‌రూ అంటున్నారు. ఈ చేజింగ్‌ సీన్ కోసం ప్ర‌భాస్ కిలోమీట‌ర్ దూరం ప‌రిగెత్తాడ‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్నాయి. బాహుబ‌లి, సాహో చిత్రాల త‌ర్వాత తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.