close
Choose your channels

విశాల్‌, మిస్కిన్.. కొన‌సాగుతున్న వివాదం

Thursday, March 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్‌, మిస్కిన్.. కొన‌సాగుతున్న వివాదం

హీరో విశాల్‌, డైరెక్ట‌ర్ మిస్కిన్ మ‌ధ్య డిటెక్టివ్ 2కి సంబంధించిన వివాదం కొన‌సాగుతూనే ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుప్ప‌రివాల‌న్‌(డిటెక్టివ్‌) సినిమాకు సీక్వెల్‌గా తుప్ప‌రివాల‌న్ 2 ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమాను యూర‌ప్‌లో చిత్రీక‌రించాల్సి ఉండ‌టంతో యూనిట్ అంతా అక్క‌డ‌కు చేరుకున్నారు. సినిమా షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. అయితే ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూ నిర్మిస్తోన్న విశాల్‌కు, డైరెక్ట‌ర్ మిస్కిన్‌కు మ‌ధ్య గొడ‌వ రావ‌డంతో సినిమాను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి మిస్కిన్ వ‌చ్చేశాడు. దీంతో విశాల్ తానే డైరెక్ష‌న్ చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. మిస్కిన్ విశాల్‌కు 15 ష‌ర‌తులు పెట్టారు. త‌న‌కు రెమ్యున‌రేష‌న్ రూ.5 కోట్లు ఇవ్వాల‌ని అన్నారు. ఈ నిబంధన‌ల‌పై విశాల్ స్పందించారు. సినిమా నుండి ద‌ర్శ‌కుడు త‌ప్ప‌కోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు విశాల్‌. డ‌బ్బుల్లేక సినిమా ఆగిపోలేద‌ని, ప్లానింగ్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య వ‌చ్చింద‌న్నారు విశాల్‌. ప్లానింగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో రూ.15 ల‌క్ష‌లు న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. త‌న‌కు వ‌చ్చిన క‌ష్టం ఏ నిర్మాత‌కు రాకూడ‌ద‌ని అన్నారు విశాల్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.