లగడపాటి విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో 'ఎవడు తక్కువకాదు' 

  • IndiaGlitz, [Friday,March 22 2019]

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లు అర్జున్ ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఫ‌ర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్. 'నా పేరు సూర్య...' పతాక సన్నివేశాలను భావోద్వేగ భరితంగా మార్చేశాడు. అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకు ముందు 'రేసుగుర్రం'లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. ఇప్పుడీ కుర్రాడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.

లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా 'ఎవడు తక్కువ కాదు'. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు 'ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్' అన్నది ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. హోలీ సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో విక్రమ్ సహిదేవ్ ప‌వ‌ర్‌ఫుల్ ఎక్స్‌ప్రెష‌న్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్... అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫ‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్ష‌న్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‌హోలీ సందర్బంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసాం. మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం అన్నారు.

More News

40 కోట్ల కామ్రేడ్‌...

విజ‌య దేవ‌ర కొండ సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతున్నాయి. అర్జున్ రెడ్డి, ఆ త‌ర్వాత వ‌చ్చిన గీత గోవిందం చిత్రాలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హీరోగా క్రేజ్‌తో పాటు బిజినెస్ ప‌రంగా మార్కెట్‌ను కూడా పెంచేశాయి.

ఏప్రిల్ 6న 'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' రిలీజ్

ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2.

చైనాకు మెగాస్టార్‌...

మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ ఉండ‌టం లేదా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

నిఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`.

శ్రీరెడ్డిపై దాడి

శ్రీరెడ్డి అలియాస్ శ్రీశ‌క్తి మీద చెన్నైలో దాడి జ‌రిగింది. లైంగిక వేధింపుల గురించి, మీటూ గురించి శ్రీరెడ్డి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న సంగ‌తి తెలిసిందే.