మాట నిలబెట్టుకోకుంటే నిజామాబాద్ ఎంపీగా రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన ధర్మపురి అరవింద్ కనివినీ ఎరుగని రీతిలో సుమారు 67వేలకు పై చిలుకు మెజార్టీతో గెలిచారు. ఇక్కడి రైతులు తమ సమస్యలు పరిష్కరించలేదని.. కవితపై తిరుగుబాటు చేస్తూ.. ఎక్కువ మంది రైతులు నామినేషన్స్ వేయడం.. కూడా అరవింద్కు కలిసొచ్చింది. అంతేకాదు.. రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతానని గట్టిగా హామీ ఇచ్చారు. దీంతో తమ సమస్యలు అరవింద్ అయితే పరిష్కరిస్తారని నమ్మిన రైతులు ఆయనకే పట్టం కట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా పరోక్షంగా ఫుల్ సపోర్ట్ చేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి.
ఫలితాల అనంతరం అరవింద్ రైతులకు ఓ ప్రామిసరీ నోట్ విడుదల చేశారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని.. అలా జరగని పక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతు/ ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించారు. కాగా.. రైతులకు పసుపు బోర్డ్, పసుపు, ఎర్ర జొన్నకు మద్దతు ధర కోసం రైతులు ఎప్పట్నుంచో నిజామాబాద్ వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారే ఉన్నారు. సో.. ఈ రైతులకు అరవింద్ ఏ మాత్రం న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.
కాగా.. అరవింద్ తండ్రి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు కుమారుడు బీజేపీ తరఫున పోటీచేసి విజయ డంఖా మోగించడం అరుదైన ఘటన అనే చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.