తేజతో మరోసారి

  • IndiaGlitz, [Monday,March 05 2018]

విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఆటానాదే వేటానాదే' (ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌ ). ఈ నెల 12 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో.. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌లో నారా రోహిత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ సరసన ఈషా రెబ్బా నటించబోతున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే.. ఈ సినిమాకు లక్ష్మి భూపాల్ మాటల రచయితగా వ్యవహరించనున్నార‌ని తెలిసింది.

గతంలో తేజ, లక్ష్మి భూపాల్ కలయికలో నేనేరాజు నేనే మంత్రి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మళ్ళీ ఈ మూవీకి వీరిద్దరూ కలిసి పనిచేయడం విశేషమనే చెప్పాలి. పైగా ఈ చిత్రంలో వెంకటేష్ పాత్ర కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రగా ఉంటుందని ఆ మధ్య కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఈ పాత్రకి.. లక్ష్మి భూపాల్ మాటలు కూడా తోడైతే సినిమా విజయం సాధిస్తుందని వెంకీ అభిమానులు భావిస్తున్నారు. దాదాపు కొత్త వాళ్ళు నటిస్తున్న ఈ సినిమాకి తమిళ్ కెమెరామెన్ రామానుజం పనిచేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

More News

ఎన్టీఆర్ కెమెరామేన్ తో రామ్

కుటుంబ కథా చిత్రాలతో..యువతను ఆకట్టుకునేలా సినిమాలను నిర్మించడంలో

టాలీవుడ్ పరిశ్రమ శ్రీదేవి కి సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభ

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి.

షూటింగ్ పూర్తి చేసుకొన్న 'నువ్వు తోపురా'

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

పాతికేళ్ళ 'అల్లరి ప్రియుడు'

తల్లిదండ్రులను దేవుడు ఇస్తాడు.కాని స్నేహితుణ్ణి మాత్రం మనల్నే ఎంచుకోమని దేవుడు మనకే వదిలేశాడు.

ఐదు చిత్రాలతో సునీల్ బిజీ బిజీ

హాస్యనటుడిగా తెలుగు తెరపై తనదైన సంతకం చేశారు సునీల్.