close
Choose your channels

తేజతో మరోసారి

Monday, March 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఆటానాదే వేటానాదే` (ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌ ). ఈ నెల 12 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో.. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌లో నారా రోహిత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రోహిత్ సరసన ఈషా రెబ్బా నటించబోతున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే.. ఈ సినిమాకు లక్ష్మి భూపాల్ మాటల రచయితగా వ్యవహరించనున్నార‌ని తెలిసింది.

గతంలో తేజ, లక్ష్మి భూపాల్ కలయికలో నేనేరాజు నేనే మంత్రి` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మళ్ళీ ఈ మూవీకి వీరిద్దరూ కలిసి పనిచేయడం విశేషమనే చెప్పాలి. పైగా ఈ చిత్రంలో వెంకటేష్ పాత్ర కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రగా ఉంటుందని ఆ మధ్య కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఈ పాత్రకి.. లక్ష్మి భూపాల్ మాటలు కూడా తోడైతే సినిమా విజయం సాధిస్తుందని వెంకీ అభిమానులు భావిస్తున్నారు. దాదాపు కొత్త వాళ్ళు నటిస్తున్న ఈ సినిమాకి తమిళ్ కెమెరామెన్ రామానుజం పనిచేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.