హైద‌రాబాద్‌లో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` సంద‌డి

  • IndiaGlitz, [Monday,October 07 2019]

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రాశీ ఖ‌న్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యారాజేశ్‌, ఇజాబెల్లీ లిటే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్... ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఇందులో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది.

కాగా... 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌'లో విజ‌య్ దేవ‌ర‌కొండ నాలుగు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపిస్తాడ‌ని టాక్‌. కాలేజ్ స్టూడెంట్ గా, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిగా, ఫ్యామిలీ ప‌ర్స‌న్‌గా, బైక్ రేస‌ర్‌గా... ఇలా విభిన్న ఛాయ‌ల్లో ఈ పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. 'గీత గోవిందం' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గోపీసుంద‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ డిసెంబ‌ర్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌' ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' ఫ‌లితం అత‌నికి కీల‌కంగా మారింది. మ‌రి.. 'వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' అయినా విజ‌య్‌ని ట్రాక్ లోకి తీసుకువ‌స్తుందేమో చూడాలి.

More News

పూరీ 'ఫైట‌ర్‌'లో వింక్ బ్యూటీ ?

'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఘ‌న‌విజ‌యం.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌లో ఎన‌లేని ఉత్సాహాన్ని నింపింది. ఈ నేప‌థ్యంలో.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ

మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్‌తో రాజ్ త‌రుణ్‌?

`ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మామ‌`, `కుమారి 21 ఎఫ్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ త‌రుణ్‌. ఆ తరువాత ఆ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేయ‌లేక‌పోయినా..

న‌య‌న్‌... ఫెస్టివ‌ల్ హీరోయిన్‌

త‌మిళ‌నాట లేడీ సూప‌ర్ స్టార్‌గా రాణిస్తోంది న‌య‌న‌తార‌. అంతేకాదు.. ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ విజ‌యాలు చూసిన ఈ ముద్దుగుమ్మ‌... ఒక‌వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌తో మురిపిస్తూనే...

'ఆర్ ఆర్ ఆర్‌'... ఫ‌స్ట్ కాంబినేష‌న్ సీన్ అప్‌డేట్‌

ఒకే త‌రానికి చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది క‌దూ! ద‌శాబ్దాల త‌రువాత ఇలాంటి ఎక్స్‌పీరియ‌న్స్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు.

క్రిస్మ‌స్ సీజ‌న్‌లో బాల‌య్య సంద‌డి

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌... ప్ర‌స్తుతం ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.