close
Choose your channels

మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్‌తో రాజ్ త‌రుణ్‌?

Monday, October 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రోసారి ఆ డైరెక్ట‌ర్‌తో రాజ్ త‌రుణ్‌?

`ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మామ‌`, `కుమారి 21 ఎఫ్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ త‌రుణ్‌. ఆ తరువాత ఆ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేయ‌లేక‌పోయినా.. `ఈడో ర‌కం ఆడో ర‌కం`, `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` రూపంలో చెప్పుకోద‌గ్గ విజ‌యాలు చూశాడు. అయితే, గ‌త ఏడాది `రంగుల రాట్నం`, `రాజుగాడు`, `ల‌వ‌ర్‌` రూపంలో వ‌రుస‌గా మూడు ప‌రాజ‌యాలు ద‌క్క‌డంతో.. ప్ర‌స్తుతం ఆచితూచి సినిమాల‌ను ఎంచుకుంటున్నాడు రాజ్ త‌రుణ్‌.

ఈ నేప‌థ్యంలోనే.. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు నిర్మాణంలో `ఇద్ద‌రి లోకం ఒక‌టే` చేస్తున్నాడు త‌రుణ్‌. అలాగే `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` ఫేమ్ కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. కాగా... మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా రాజ్ త‌రుణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. గ‌తంలో త‌న‌తో `సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు`ని తెర‌కెక్కించిన శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ త‌రుణ్ ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ ఎంపిక జ‌రుగుతోంద‌ని స‌మాచారం. మ‌రి.. మూడేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ జ‌ట్టుక‌ట్ట‌నున్న రాజ్ త‌రుణ్‌, శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి కి ఈ సారైనా విజ‌యం ద‌క్కుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.