close
Choose your channels

ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజనా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

Friday, November 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజనా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఈ మాటలు విన్న వైసీపీ శ్రేణులు ఒకింత విస్మయానికి గురయ్యాయి. ఇదేంటి అధికార పార్టీలో ఉండి ఎంపీలు , ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? అని వైసీపీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ వ్యవహారంపై తేల్చేయడానికి.. క్లారిటీ ఇవ్వడానికి వైసీపీ ఎంపీలు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకున్నారు. మీడియా వేదికగా సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీని చంద్రబాబు సూట్‌కేసుల దోచుకున్నారని.. సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని, ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చెప్పారు. జగన్‌ మాకు దైవంతో సమానమని నందిగాం సురేష్‌ పేర్కొన్నారు.

సుజనా ఎవరంటే...!

సుజానా ఎవరంటే బ్యాంకు దొంగ అని చెబుతారని, గూగుల్‌ కూడా ఇదే చెబుతుందని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్‌ పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ‘సుజనా చౌదరి టీడీపీ నుంచి చాటుమాటున బీజేపీలో చేరారు. సుజనా చౌదరి అని ఎవరిని అడిగినా ఆయన ఓ బ్యాంకు దొంగ అని చెబుతున్నారు. అసలు ఆయన ఒరిజనల్‌ బీజేపీనా? డూప్లికేట్‌నా అన్నది అర్థం కావడం లేదు. మాకు రెండు పూటల ఫుడ్‌ దొరికితే చాలు అనుకుంటాం.. నీలాగా బ్యాంకులకు ఎగ్గొట్టాలని మాకు లేదు. ఓ కార్యకర్తను ఎంపీని చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది. ఆ సీటుకు వంద మంది పోటీ పడినా కూడా పేదొడికి సీటు ఇచ్చి గెలిపించారు. అలాంటి సుజనా చౌదరి వైసీపీ ఎంపీలు మాకు టచ్‌లో ఉన్నారని చెప్పడం దారుణం. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేని సుజనా చౌదరికి వేరే పార్టీ ఎంపీలు టచ్‌లో ఉంటారా..?. సుజనా చౌదరి రాజ్యాంగాన్ని బ్రేక్‌ చేస్తున్నారని అంటున్నారు.. ఆయన ఒక పార్టీ తరఫున ఎన్నికై వేరే పార్టీలో చేరడం రాజ్యాంగబద్ధమా..?. జగన్‌కు మేమందరం అండగా ఉంటే వేలెత్తి చూపుతున్నారు’ అని సురేష్ చెప్పుకొచ్చారు.

‘పేదలకు మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియంప్రవేశపెడితే రాద్దాంతం చేస్తున్నారు. మీరు విదేశాలకు వెళ్లి బెంజీ కారులో తిరుగుతుంటే పేదల పిల్లలు అలా తిరుగకూడదా..?. సుజనా.. నీ ఆటలు సాగవు. నీపై విచారణ జరుగకుండా ఉండేందుకు పార్టీ మారావ్. చంద్రబాబును కాపాడేందుకు పని చేస్తున్నారు. టీడీపీ అన్నది ఏపీలో చనిపోయింది. దాన్ని బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. చంద్రబాబు, నీవు జైలుకు వెళ్లకుండా బీజేపీతో కలిసి వెళ్తున్నారు. జగన్‌కు ఒక సిద్ధాంతం ఉంది.. మా పార్టీ ఒక ఆశయంతో ఏర్పాటైంది. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారికి అర్థం కావడం లేదు. సుజనా చౌదరి మాపై ఇలాంటి కామెంట్లు చేస్తే పరిస్థితులు మరొ రకంగా ఉంటాయ్’ అని సురేష్ హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.