close
Choose your channels

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

Wednesday, October 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..? అదేం కాదండోయ్.. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు, నారా చంద్రబాబు సమీప బంధువు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఎకరా కేవలం నామమాత్రపు ధర రూ. లక్షకు 498.93 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేస్తూ.. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియా ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో భూములు ఇవ్వడమే కాకుండా.. ఆ భూమిని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువస్తూ అప్పట్లో బాబు జీఓను సైతం జారీ చేసిన విషయాన్ని మంత్రి బయటపెట్టారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ.. ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బాలయ్యకే కాదు.. ఆయన వియ్యంకుడు, చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకున్నారట. అయితే ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో మార్కెట్‌లో ఎకరా రూ. 50 కోట్లు ధర పలికే అత్యంత విలువైన 13 ఎకరాల 83 సెంట్ల భూమిని హీనాతి హీనంగా ఎకరా రూ. 4 లక్షలకు లూలూ అనే సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారని మంత్రి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ఆస్తిని కొల్లగొట్టే రీతిలో ఉన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ కేబినెట్‌లో తీర్మానించడం జరిగిందని పేర్ని నాని మీడియా మీట్‌లో స్పష్టంగా వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.